Friday, September 13, 2013

16 On The Final Chargesheet


Y.S. Jagan
ముగింపు దశకు జగన్ కేసు దర్యాప్తు కోర్టుకు తెలిపిన సీబీఐ కౌంటర్‌పై గడువుకు వినతి బెయిల్‌పై విచారణ 18కి వాయిదా  వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు త్వరలో కొలిక్కి రానుంది. ఈ కేసులో వివిధ అంశాలకు సంబంధించి ఇప్పటికే 8 చార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ అదే క్రమంలో చివరి అభియోగ పత్రాన్ని కూడా సమర్పించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే సోమవారమే(16న) సీబీఐ కోర్టులో తుది చార్జిషీట్ దాఖలు చేయాలని నిర్ణయించింది.

ఈ కేసు పరిశోధనాధికారిగా ఉన్న డీఐజీ వెంకటేశ్ బదిలీపై వెళ్లనుండటంతో ఆలోగానే తుది చార్జిషీట్‌ను కోర్టుకు అందించడం సముచితంగా ఉంటుందని సీబీఐ కేంద్ర వర్గాలు భావించాయి. దీంతో ఈ మేరకు హైదరాబాద్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

For More Today's Latest News please visit Andhra Jyothy ePaper

No comments:

Post a Comment