ముగింపు దశకు జగన్ కేసు దర్యాప్తు కోర్టుకు తెలిపిన సీబీఐ కౌంటర్పై గడువుకు వినతి బెయిల్పై విచారణ 18కి వాయిదా వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసు త్వరలో కొలిక్కి రానుంది. ఈ కేసులో వివిధ అంశాలకు సంబంధించి ఇప్పటికే 8 చార్జిషీట్లు దాఖలు చేసిన సీబీఐ అదే క్రమంలో చివరి అభియోగ పత్రాన్ని కూడా సమర్పించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే సోమవారమే(16న) సీబీఐ కోర్టులో తుది చార్జిషీట్ దాఖలు చేయాలని నిర్ణయించింది.
ఈ కేసు పరిశోధనాధికారిగా ఉన్న డీఐజీ వెంకటేశ్ బదిలీపై వెళ్లనుండటంతో ఆలోగానే తుది చార్జిషీట్ను కోర్టుకు అందించడం సముచితంగా ఉంటుందని సీబీఐ కేంద్ర వర్గాలు భావించాయి. దీంతో ఈ మేరకు హైదరాబాద్ అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
No comments:
Post a Comment