కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలంగాణపై కేంద్ర కేబినెట్ నోట్ చర్చకు వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. కేంద్ర మంత్రివర్గ సమావేశం గురువారం జరగాల్సి ఉన్నప్పటికీ... ప్రధాని మన్మోహన్ ఛత్తీస్గఢ్ పర్యటన నేపథ్యంలో అది శుక్రవారం ఉదయం 9.35 గంటలకు వాయిదా పడింది. ఈ కేబినెట్ సమావేశం అజెండాలో తెలంగాణ అంశం లేకపోవడం గమనార్హం. కేబినెట్ నోట్ తయారీ ఇంకా కొలిక్కిరాలేదని, అందువల్ల అజెండాలో వచ్చే అవకాశాలు లేవని అధికార వర్గాలు అంటున్నాయి.
నోట్ ఎలా తయారు చేయాలన్న విషయంపైనే హోంశాఖ మల్లగుల్లాలు పడుతున్నాయని మరికొన్ని వర్గాలు చెబుతున్నాయి. మరీ ముఖ్యంగా... హైదరాబాద్ అంశంపై రకరకాల ప్రతిపాదనలు రావడంతో హోంశాఖ అయోమయంలో పడిందని, ఈ విషయం తేల్చేదాకా నోట్ తయారీ పూర్తి కాదని అంటున్నారు.
For More Today's Latest News please visit Andhra Jyothy ePaper
No comments:
Post a Comment